కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి. జహంగీర్ విమర్శించారు. చౌటుప్పల్లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ నిరసన ర్యాలీ, ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 4 లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల హక్కులను కాలరాస్తూ, రోజువారీ పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కోడ్ల వల్ల భవన నిర్మాణం, హమాలీ, రవాణా, బీడీ కార్మికుల సంక్షేమం దెబ్బతింటుందన్నారు.
విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాల సవరణలతో రైతులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, కార్మిక సంఘాల నాయకులు చిర్కఅలివేలు, గోశిక కరుణాకర్, చీర్క సంజీవరెడ్డి, ఆదిమూల నందీశ్వర్, చీమ కళ్ళ శ్రీరాములు, జొన్న కంటి దేవయ్య, చింతల సుదర్శన్, ఆకుల ధర్మయ్య, బాతరాజు దశరథ, యాట బాలరాజు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, చెరుకు లక్ష్మమ్మ, జక్కిడి అంజిరెడ్డి, యాట వెంకటేశం, తోర్పునూరి మల్లేశ, కొండ శ్రీశైలం, మీసాల శ్రీను, యాదయ్య, మల్లమ్మ, జ్యోతి, నరసింహ, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, మాండ్ర కోటయ్య పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి