Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 08:40 PM

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ఎం.డి. జహంగీర్

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ఎం.డి. జహంగీర్

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ఎం.డి. జహంగీర్
10-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి. జహంగీర్ విమర్శించారు. చౌటుప్పల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ నిరసన ర్యాలీ, ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 4 లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులను కాలరాస్తూ, రోజువారీ పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కోడ్‌ల వల్ల భవన నిర్మాణం, హమాలీ, రవాణా, బీడీ కార్మికుల సంక్షేమం దెబ్బతింటుందన్నారు.

విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాల సవరణలతో రైతులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ​ఈ 4 లేబర్ కోడ్‌లను రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, కార్మిక సంఘాల నాయకులు చిర్కఅలివేలు, గోశిక కరుణాకర్, చీర్క సంజీవరెడ్డి, ఆదిమూల నందీశ్వర్, చీమ కళ్ళ శ్రీరాములు, జొన్న కంటి దేవయ్య, చింతల సుదర్శన్, ఆకుల ధర్మయ్య, బాతరాజు దశరథ, యాట బాలరాజు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, చెరుకు లక్ష్మమ్మ, జక్కిడి అంజిరెడ్డి, యాట వెంకటేశం, తోర్పునూరి మల్లేశ, కొండ శ్రీశైలం, మీసాల శ్రీను, యాదయ్య, మల్లమ్మ, జ్యోతి, నరసింహ, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, మాండ్ర కోటయ్య పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ఎం.డి. జహంగీర్

Article Image

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి. జహంగీర్ విమర్శించారు. చౌటుప్పల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ నిరసన ర్యాలీ, ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 4 లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులను కాలరాస్తూ, రోజువారీ పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కోడ్‌ల వల్ల భవన నిర్మాణం, హమాలీ, రవాణా, బీడీ కార్మికుల సంక్షేమం దెబ్బతింటుందన్నారు.

విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాల సవరణలతో రైతులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ​ఈ 4 లేబర్ కోడ్‌లను రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, కార్మిక సంఘాల నాయకులు చిర్కఅలివేలు, గోశిక కరుణాకర్, చీర్క సంజీవరెడ్డి, ఆదిమూల నందీశ్వర్, చీమ కళ్ళ శ్రీరాములు, జొన్న కంటి దేవయ్య, చింతల సుదర్శన్, ఆకుల ధర్మయ్య, బాతరాజు దశరథ, యాట బాలరాజు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, చెరుకు లక్ష్మమ్మ, జక్కిడి అంజిరెడ్డి, యాట వెంకటేశం, తోర్పునూరి మల్లేశ, కొండ శ్రీశైలం, మీసాల శ్రీను, యాదయ్య, మల్లమ్మ, జ్యోతి, నరసింహ, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, మాండ్ర కోటయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News