నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరామర్శించారు. మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు గుడిబోయిన వెంకటేశ్వర్లు తండ్రి గుడిబోయిన సైదులు మృతి చెందగా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోర మల్లయ్య సతీమణి మోర పద్మ మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి