రైతాంగం సుభిక్షంగా ఉండాలి
నాగార్జునసాగర్లో వరుణ యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ విజయవిహార్ ప్రాంగణంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ యాగంలో సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని, సాగునీటి వనరులు పుష్కలంగా లభించి రైతులు మంచి పంటలు పండించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రైతాంగం సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి అవసరమైన నీరు అందుబాటులో ఉండాలని, రైతులకు ప్రకృతి అనుకూలంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి