స్థానికం, నాగోల్: డెలివరీ పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు తిరిగి ఇంటికి చేరకపోవడంతో అదృశ్యమైన ఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీకి చెందిన సైదు భాగ్యరాజు జెప్టో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న డెలివరీ పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాగ్యరాజు ఆ తర్వాత తిరిగి రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో భాగ్యరాజు భార్య రేవతి నాగోల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యరాజు చివరిగా ఎక్కడికి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఫోన్ కాల్ వివరాలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఆచూకీ లభించిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు పేర్కొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి