మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష
మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష
Krishna
సదాశివపేట పట్టణంలో వాహన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి, విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దపురం రవీందర్ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 67 మి.గ్రా/100 మి.లీ. ఆల్కహాల్ సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. కేసును విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అతనికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, పట్టుబడిన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి చట్టప్రకారం శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి