Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 11:24 PM

మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష

మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష

మద్యం మత్తులో పోలీసులతో దురుసు.. నాలుగు రోజుల జైలు శిక్ష
July 27, 2026 08:07 PM 373 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలో వాహన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి, విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దపురం రవీందర్‌ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 67 మి.గ్రా/100 మి.లీ. ఆల్కహాల్ సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. కేసును విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అతనికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా సదాశివపేట ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేష్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, పట్టుబడిన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి చట్టప్రకారం శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News