Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:08 AM

డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు

డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు

డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు
20-09-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వ్యక్తి సజీవ దహనం? మృతదేహం గుర్తించలేని విధంగా కారు దగ్ధం

సూర్యాపేట రూరల్: ఖమ్మం–హైదరాబాద్‌ 365బీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమై బూడిదగా మారింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం. అయితే కారులో ఒక్కరే ఉన్నారా? మరెవరైనా ఉన్నారా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కారు పూర్తిగా కాలిపోవడంతో లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యను గుర్తించడం కష్టంగా మారింది.

సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్‌ ఎస్సై అనిల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, కారులో ఎంతమంది ప్రయాణించారు తదితర విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Sthanikam

డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు

Article Image

వ్యక్తి సజీవ దహనం? మృతదేహం గుర్తించలేని విధంగా కారు దగ్ధం

సూర్యాపేట రూరల్: ఖమ్మం–హైదరాబాద్‌ 365బీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమై బూడిదగా మారింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం. అయితే కారులో ఒక్కరే ఉన్నారా? మరెవరైనా ఉన్నారా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కారు పూర్తిగా కాలిపోవడంతో లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యను గుర్తించడం కష్టంగా మారింది.

సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్‌ ఎస్సై అనిల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, కారులో ఎంతమంది ప్రయాణించారు తదితర విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News