తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కోదాడలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. గత లోక్సభ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు లభించిన భారీ ఆధిక్యమే ఈ ప్రాంతంలో పార్టీకి ఉన్న ప్రజాబలానికి నిదర్శనమని ఉత్తమ్ పేర్కొన్నారు. లక్షకు పైగా మెజారిటీ సాధించడంలో ఈ రెండు నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని స్పష్టం చేశారు.అనంతరం మెగా జాబ్మేళా ప్రాముఖ్యతను వివరిస్తూ, గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందుబాటులోకి తీసుకురావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.
తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్
Harish reporter
తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కోదాడలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. గత లోక్సభ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు లభించిన భారీ ఆధిక్యమే ఈ ప్రాంతంలో పార్టీకి ఉన్న ప్రజాబలానికి నిదర్శనమని ఉత్తమ్ పేర్కొన్నారు. లక్షకు పైగా మెజారిటీ సాధించడంలో ఈ రెండు నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని స్పష్టం చేశారు.అనంతరం మెగా జాబ్మేళా ప్రాముఖ్యతను వివరిస్తూ, గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందుబాటులోకి తీసుకురావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి