హాజరైన మల్లికార్జున పాఠశాల యజమాన్యం, విద్యార్థులు
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీలో అభ్యుదయ యూత్, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్లికార్జున పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విద్యార్థులకు, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాని మారపెల్లి మల్లారెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయురాలు లక్ష్మిదేవి, ఉపాధ్యాయులు కవిత, రజిత, శృతి, అభ్యుదయ యూత్ అధ్యక్షుడు చెవగొని వెంకటేష్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి వర్కాల జయరాం గౌడ్, చెరుకు శ్రీనివాస్ గౌడ్, తోర్పు నూరి రవి గౌడ్, ఉష్కాగుల వెంకటేష్ గౌడ్, తొర్పునూరి సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి