Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:34 PM

కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం: మంత్రి శ్రీధర్‌బాబు

కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం: మంత్రి శ్రీధర్‌బాబు

కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం: మంత్రి శ్రీధర్‌బాబు
19-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.శనివారం కోదాడలో నిర్వహించిన జాబ్మేళాలో పాల్గొని మాట్లాడారు.యువత నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. యువత నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.అనంతరం మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.జాబ్‌మేళాలో పాల్గొన్న 350కి పైగా కంపెనీలు దాదాపు 5,725 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేయడం గొప్ప విజయమని శ్రీధర్‌బాబు అభినందించారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి వారం రోజులుగా నిరంతరం శ్రమించిన అధికారులు, కంపెనీల ప్రతినిధులు, సుమారు 700 మంది వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.

ప్రభుత్వం ఒక్కటే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేటు రంగం కూడా ముందుకొచ్చి ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, డిప్లొమా, ఐటీఐ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువతకు పరిశ్రమలు విస్తృత అవకాశాలు కల్పించాలన్నారు.వందలాది కంపెనీలను గ్రామీణ యువత వద్దకు తీసుకొచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొనేలా ఉత్తమ్‌ వ్యక్తిగతంగా పలుమార్లు సంప్రదింపులు జరిపారని చెప్పారు.ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి విజ్ఞప్తి మేరకు కోదాడలో వీలైనంత త్వరగా ‘టాస్క్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించే ప్రధాన వేదికగా మారడంతోపాటు వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.


Sthanikam

కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం: మంత్రి శ్రీధర్‌బాబు

Article Image

నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.శనివారం కోదాడలో నిర్వహించిన జాబ్మేళాలో పాల్గొని మాట్లాడారు.యువత నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. యువత నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.అనంతరం మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.జాబ్‌మేళాలో పాల్గొన్న 350కి పైగా కంపెనీలు దాదాపు 5,725 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేయడం గొప్ప విజయమని శ్రీధర్‌బాబు అభినందించారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి వారం రోజులుగా నిరంతరం శ్రమించిన అధికారులు, కంపెనీల ప్రతినిధులు, సుమారు 700 మంది వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.

ప్రభుత్వం ఒక్కటే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేటు రంగం కూడా ముందుకొచ్చి ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, డిప్లొమా, ఐటీఐ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువతకు పరిశ్రమలు విస్తృత అవకాశాలు కల్పించాలన్నారు.వందలాది కంపెనీలను గ్రామీణ యువత వద్దకు తీసుకొచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొనేలా ఉత్తమ్‌ వ్యక్తిగతంగా పలుమార్లు సంప్రదింపులు జరిపారని చెప్పారు.ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి విజ్ఞప్తి మేరకు కోదాడలో వీలైనంత త్వరగా ‘టాస్క్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించే ప్రధాన వేదికగా మారడంతోపాటు వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News