కోదాడలో శనివారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 4,300 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు.
అభ్యర్థులను కోదాడకు తరలించేందుకు 16 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జాబ్మేళాలో పాల్గొన్నారు.
అభ్యర్థుల తరలింపు ప్రక్రియను ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్రావు స్వయంగా పర్యవేక్షించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేశారు. జాబ్మేళా విజయవంతం కావడానికి సహకరించిన అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి