కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువతను జాబ్మేళాకు తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సును శనివారం ఆయన ప్రారంభించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో జరిగే జాబ్మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువత కోదాడకు తరలివచ్చి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కోట ఉమారాణి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, మొహమ్మద్ నాసర్, జెల్లా వెంకటేశం, గురికే శేఖర్, కేశవదాస్, వెంకటేశం, మొహమ్మద్ మన్సూర్, జీపీఓ కొమ్ము నరసింహ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి