Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:23 AM

నారాయణ హైస్కూల్ లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ

నారాయణ హైస్కూల్ లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ

నారాయణ హైస్కూల్ లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ
19-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జాతీయ సమైక్యతకు సంకేతం గణేష్ ఉత్సవాలు: డిజీఎం వెంకటరమణారెడ్డి

వినాయక చవితి పండగను పురస్కరించుకుని పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో శుక్రవారం గణపతి హోమం, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ విద్యాసంస్థల డిజీఎం వెంకటరమణారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ప్రజలందరినీ ఏకం చేసి, పోరాట పటిమను పెంచేందుకు లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాడు తిలక్ నాటిన ఆ సమైక్యతా బీజమే నేడు దేశమంతటా మహా ఉత్సవంగా వికసించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఉత్సవాలు సంస్కృతీ సాంప్రదాయాలకు, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని 'సర్వేజనా సుఖినోభవంతు' అని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ నవనీత, దివ్య, నరేష్, కోఆర్డినేటర్లు రవిశంకర్, సునీత, హర్ష, వైస్ ప్రిన్సిపాల్స్ హసీనా, క్రాంతి, అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ హైస్కూల్ లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ

Article Image

జాతీయ సమైక్యతకు సంకేతం గణేష్ ఉత్సవాలు: డిజీఎం వెంకటరమణారెడ్డి

వినాయక చవితి పండగను పురస్కరించుకుని పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో శుక్రవారం గణపతి హోమం, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ విద్యాసంస్థల డిజీఎం వెంకటరమణారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ప్రజలందరినీ ఏకం చేసి, పోరాట పటిమను పెంచేందుకు లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాడు తిలక్ నాటిన ఆ సమైక్యతా బీజమే నేడు దేశమంతటా మహా ఉత్సవంగా వికసించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఉత్సవాలు సంస్కృతీ సాంప్రదాయాలకు, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని 'సర్వేజనా సుఖినోభవంతు' అని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ నవనీత, దివ్య, నరేష్, కోఆర్డినేటర్లు రవిశంకర్, సునీత, హర్ష, వైస్ ప్రిన్సిపాల్స్ హసీనా, క్రాంతి, అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News