అక్రమ క్లినిక్లపై డీఎంహెచ్ఓ కొరడా
రంగారెడ్డి సెప్టెంబర్ 18.
అక్రమ క్లినిక్లు, ల్యాబ్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు ముమ్మరం చేసింది. డీఎంహెచ్ఓ డా. స్వర్ణకుమారి ఆదేశాలతో హఫీజ్పేట్, నార్సింగిలో తనిఖీలు నిర్వహించి రెండు క్లినిక్లను సీజ్ చేశారు.
హఫీజ్పేట్లోని రియా క్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్లో అనుమతులు లేకుండా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నార్సింగిలోని ప్రియదర్శిని క్లినిక్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.
నిబంధనలకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమ క్లినిక్లు, ల్యాబ్లపై తనిఖీలు కొనసాగుతాయి” అని డీఎంహెచ్ఓ డా. స్వర్ణకుమారి హెచ్చరించారు.డెమో గంగాసాని మంజుల, శ్రీనివాస్ బృందాలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి