Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తంగడపల్లిలో 27న 'ఆసరా' మెగా ఉద్యోగ మేళా అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 05:16 PM

కాళోజీ ఓ శిఖరం.వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

కాళోజీ ఓ శిఖరం.వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

కాళోజీ ఓ శిఖరం.వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
18-09-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: సామాజిక జీవితంలో కాళోజీ నారాయణరావు ఓ శిఖరంలాంటి వ్యక్తి అని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా శుక్రవారం యూనివర్సిటీలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, సమాజ అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. వాడుక భాషలో రచనలు చేస్తూ ప్రజాకవిగా గుర్తింపు పొందారని తెలిపారు.

ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు డా. కె. శ్రీనివాస్‌ ‘తెలంగాణ సాహిత్యం: ప్రజల గొడవ’ అంశంపై ప్రసంగిస్తూ.. కాళోజీ రచనలు సామాజిక అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల గొంతుకగా నిలిచాయని అన్నారు. తెలంగాణ సాహిత్యం ప్రజల ఆకాంక్షలు, ఆవేదనలకు స్వరంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అకాడమిక్‌ డైరెక్టర్‌ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా రిజిస్ట్రార్‌ డా. ఎల్వీకే రెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కాళోజీ ఓ శిఖరం.వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

Article Image

హైదరాబాద్‌: సామాజిక జీవితంలో కాళోజీ నారాయణరావు ఓ శిఖరంలాంటి వ్యక్తి అని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా శుక్రవారం యూనివర్సిటీలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, సమాజ అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. వాడుక భాషలో రచనలు చేస్తూ ప్రజాకవిగా గుర్తింపు పొందారని తెలిపారు.

ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు డా. కె. శ్రీనివాస్‌ ‘తెలంగాణ సాహిత్యం: ప్రజల గొడవ’ అంశంపై ప్రసంగిస్తూ.. కాళోజీ రచనలు సామాజిక అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల గొంతుకగా నిలిచాయని అన్నారు. తెలంగాణ సాహిత్యం ప్రజల ఆకాంక్షలు, ఆవేదనలకు స్వరంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అకాడమిక్‌ డైరెక్టర్‌ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా రిజిస్ట్రార్‌ డా. ఎల్వీకే రెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News