Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! నారాయణ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 01:27 AM

నారాయణ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

నారాయణ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

నారాయణ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
17-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆపరేషన్ పోలోతోనే నిజాం పాలనకు అంతం: నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ నవనీత

స్థానిక నారాయణ హై స్కూల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.​1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం విముక్తి లభించలేదని ఆమె గుర్తుచేశారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ఉంచాలని భావించాడన్నారు. "భారత్‌లో కలవను.. అవసరమైతే పాకిస్థాన్‌లో కలుస్తా" అని బెదిరింపులకు దిగుతూ, కాశిం రజ్వీ నాయకత్వంలోని 20,000 మంది రజాకార్లతో పల్లెలపై దాడులు చేయించారని విమర్శించారు. నిజాం పాలనలోని రాక్షసత్వాన్ని, మరణహోమాన్ని ఎంతమాత్రం సహించని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవ తీసుకున్నారని తెలిపారు.

​1948 సెప్టెంబర్ 13న భారత సైన్యంతో 'ఆపరేషన్ పోలో'ను ప్రారంభించి, సెప్టెంబర్ 17 సాయంత్రానికి నిజాం సైన్యాన్ని లొంగదీసుకున్నారని వివరించారు. దీంతో 235 ఏళ్ల సుదీర్ఘ నిజాం పాలన ముగిసి, హైదరాబాద్ సంస్థానంలో భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి మాధవి, ఏవో బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

Article Image

ఆపరేషన్ పోలోతోనే నిజాం పాలనకు అంతం: నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ నవనీత

స్థానిక నారాయణ హై స్కూల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.​1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం విముక్తి లభించలేదని ఆమె గుర్తుచేశారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ఉంచాలని భావించాడన్నారు. "భారత్‌లో కలవను.. అవసరమైతే పాకిస్థాన్‌లో కలుస్తా" అని బెదిరింపులకు దిగుతూ, కాశిం రజ్వీ నాయకత్వంలోని 20,000 మంది రజాకార్లతో పల్లెలపై దాడులు చేయించారని విమర్శించారు. నిజాం పాలనలోని రాక్షసత్వాన్ని, మరణహోమాన్ని ఎంతమాత్రం సహించని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవ తీసుకున్నారని తెలిపారు.

​1948 సెప్టెంబర్ 13న భారత సైన్యంతో 'ఆపరేషన్ పోలో'ను ప్రారంభించి, సెప్టెంబర్ 17 సాయంత్రానికి నిజాం సైన్యాన్ని లొంగదీసుకున్నారని వివరించారు. దీంతో 235 ఏళ్ల సుదీర్ఘ నిజాం పాలన ముగిసి, హైదరాబాద్ సంస్థానంలో భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి మాధవి, ఏవో బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News