Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! నారాయణ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 02:39 AM

బి స్మార్ట్ జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్‌గౌడ్

బి స్మార్ట్ జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్‌గౌడ్

బి స్మార్ట్ జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్‌గౌడ్
17-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: బడ్జెట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (బి స్మార్ట్‌) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా కొండూరి మల్లేష్‌గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భువనగిరిలో బి స్మార్ట్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డా. పగిడాల జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నోముల బసవరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తీగల జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఏ.కీర్తి, కోశాధికారిగా ప్యారి బేగంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు జలంధర్‌రెడ్డి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి బి స్మార్ట్‌ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి, దశరథ్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

Sthanikam

బి స్మార్ట్ జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్‌గౌడ్

Article Image

భువనగిరి: బడ్జెట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (బి స్మార్ట్‌) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా కొండూరి మల్లేష్‌గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భువనగిరిలో బి స్మార్ట్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డా. పగిడాల జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నోముల బసవరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తీగల జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఏ.కీర్తి, కోశాధికారిగా ప్యారి బేగంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు జలంధర్‌రెడ్డి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి బి స్మార్ట్‌ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి, దశరథ్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News