Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:38 PM

కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
17-09-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించే స్థలాన్ని గురువారం నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్ ,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్‌కలెక్టర్ ఉమా హారతి అధికారులకు సూచించారు. చెరువు వద్ద భద్రత, వెలుతురు, రాకపోకలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానూర్ ఎస్‌ఐ కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం కమలాపూర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించే స్థలాన్ని గురువారం నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్ ,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్‌కలెక్టర్ ఉమా హారతి అధికారులకు సూచించారు. చెరువు వద్ద భద్రత, వెలుతురు, రాకపోకలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానూర్ ఎస్‌ఐ కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News