మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రధానోపాధ్యాయురాలు సునీత తెలిపారు.విషయం తెలుసుకున్న రాయికోడ్ 108 సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తమ పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
PRINT TIME: September 17, 2026 09:11 PM
మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు అస్వస్థత.. 20 మంది ఆసుపత్రికి తరలింపు
మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు అస్వస్థత.. 20 మంది ఆసుపత్రికి తరలింపు
17-09-2026
47 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రధానోపాధ్యాయురాలు సునీత తెలిపారు.విషయం తెలుసుకున్న రాయికోడ్ 108 సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని తమ పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి