Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తంగడపల్లిలో 27న 'ఆసరా' మెగా ఉద్యోగ మేళా అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 04:08 PM

రోడ్డు ప్రమాద బాధితులకు జిల్లా ఎస్పీ తక్షణ సాయం

రోడ్డు ప్రమాద బాధితులకు జిల్లా ఎస్పీ తక్షణ సాయం

రోడ్డు ప్రమాద బాధితులకు జిల్లా ఎస్పీ తక్షణ సాయం
18-09-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సదాశివపేటలోని ఊబ చెరువు వద్దకు వెళ్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్‌కు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో నందికంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింది.వెంటనే స్పందించిన ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు.పోలీసు సిబ్బంది, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను పోలీసు వాహనం, అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కంది గ్రామానికి చెందిన శివలీల, ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బి. సంతోష్, బీదర్ జిల్లాకు చెందిన బైక్ రైడర్ ఎన్. అమర్ గాయపడినట్లు తెలిపారు.ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి గాయపడిన వారికి ఎస్పీ స్వయంగా సహాయం అందించడం పట్ల స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాద బాధితులకు జిల్లా ఎస్పీ తక్షణ సాయం

Article Image

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సదాశివపేటలోని ఊబ చెరువు వద్దకు వెళ్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్‌కు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో నందికంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింది.వెంటనే స్పందించిన ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు.పోలీసు సిబ్బంది, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను పోలీసు వాహనం, అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కంది గ్రామానికి చెందిన శివలీల, ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బి. సంతోష్, బీదర్ జిల్లాకు చెందిన బైక్ రైడర్ ఎన్. అమర్ గాయపడినట్లు తెలిపారు.ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి గాయపడిన వారికి ఎస్పీ స్వయంగా సహాయం అందించడం పట్ల స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News