భువనగిరి, సెప్టెంబర్ 18:
ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా యాదగిరిగుట్టకు చెందిన ఎస్వీఎన్ హైస్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026–28 సంవత్సరాలకు జరిగిన ఎన్నికల్లో ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
31 ఏళ్ల విద్యా అనుభవం..
యాదగిరిగుట్టలో ఎస్వీఎన్ హైస్కూల్ను స్థాపించి గత 31 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాస్కర్కు ట్రస్మా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
“ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారమే లక్ష్యం”
ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
నూతన కార్యవర్గం: ప్రధాన కార్యదర్శిగా కొయ్యలగూడెంకు చెందిన సయ్యద్, కోశాధికారిగా మోత్కూర్ సెయింట్ ఆన్స్ స్కూల్ ఫౌండర్ మరియన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి