రైతులు ఒకే తాటిపైకి వచ్చి సంఘటితంగా పనిచేసి ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రోత్సహిస్తోందని గూడూరు సర్పంచ్ జగన్నాథ్, మనూర్ పీఏసీఎస్ కార్యదర్శి జనార్ధన్ తెలిపారు. శుక్రవారం మనూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో గూడూరు గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వ అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరడం ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సమష్టిగా కొనుగోలు చేసి సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. అలాగే పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్లో లేదా కంపెనీలకు విక్రయించడం ద్వారా మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ వంటి సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వ రాయితీలు, తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పీఏసీఎస్ మనూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి
రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి
Krishna
రైతులు ఒకే తాటిపైకి వచ్చి సంఘటితంగా పనిచేసి ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రోత్సహిస్తోందని గూడూరు సర్పంచ్ జగన్నాథ్, మనూర్ పీఏసీఎస్ కార్యదర్శి జనార్ధన్ తెలిపారు. శుక్రవారం మనూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో గూడూరు గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వ అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరడం ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సమష్టిగా కొనుగోలు చేసి సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. అలాగే పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్లో లేదా కంపెనీలకు విక్రయించడం ద్వారా మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ వంటి సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వ రాయితీలు, తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పీఏసీఎస్ మనూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి