మెగా ఉద్యోగ మేళాకు పటిష్ట పోలీసు బందోబస్తు
బందోబస్తు విధులకు 600 మంది పోలీస్
ఉద్యోగ మేళా కు హాజరైయ్యే యువతకు పూర్తి రక్షణ కల్పిస్తాం
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
నేడు కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్ కాన్వెంట్ విద్యాలయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉద్యోగ మేళాకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. వాహనాల మార్గాలను, పార్కింగ్ స్థలాలను, ఉద్యోగ మేళా ప్రాంగణాన్ని పరిశీలించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు పూర్తి చేశాము, 600 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారు అన్నారు. ఉద్యోగ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి రక్షణ కల్పించేలా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బందోబస్తు విధుల్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన సుమారు 600 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. బందోబస్తులో ఒక ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్సై సహా 600 మంది పోలీస్ సిబ్బంది కలిసి విధులు నిర్వహిస్తారని తెలిపారు.పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ మేళా కున్ హాజరయ్యే వారి వాహనాల కోసం 8 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థులు వేచి ఉండడానికి 5 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ప్రాంగణంలో పోలీస్ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాము అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీ లు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రవి, స్థానిక ఇన్స్పెక్టర్ శివ శంకర్, ఎస్ఐ లు సిబ్బంది ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి