Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:40 PM

పోషకాహారంతోనే రక్తహీనతకు చెక్‌. ఏడబ్ల్యూఎస్ సూపర్వైజర్ సుజాత

పోషకాహారంతోనే రక్తహీనతకు చెక్‌. ఏడబ్ల్యూఎస్ సూపర్వైజర్ సుజాత

పోషకాహారంతోనే రక్తహీనతకు చెక్‌. ఏడబ్ల్యూఎస్ సూపర్వైజర్ సుజాత
19-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏడబ్ల్యూఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత సూచించారు. పోషణ మాసం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని చేర్చుకోవాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు.

రక్తహీనతపై అప్రమత్తత అవసరం

మహిళల్లో రక్తహీనతను నివారించేందుకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను క్రమం తప్పకుండా వాడడంతో పాటు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలసట, నీరసం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు.

తల్లి ఆరోగ్యమే.. బిడ్డకు రక్షణ

గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, బాలింతలు ప్రసవానంతరం తమ ఆరోగ్యంతో పాటు శిశువుకు తగిన పోషకాహారం అందించడంపై శ్రద్ధ వహించాలని సుజాత పేర్కొన్నారు. చిన్నారులకు తల్లిపాలు, వయసుకు అనుగుణంగా అదనపు పోషకాహారం అందించడం ముఖ్యమన్నారు.

పోషకాహారాన్ని నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని, పోషణ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు చిప్పలపల్లి సౌజన్య, నాగటి మంగమ్మ, ఆయాలు, వార్డు సభ్యులు కట్ట తనుశ్రీ, నోముల ఉమాదేవి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోషకాహారంతోనే రక్తహీనతకు చెక్‌. ఏడబ్ల్యూఎస్ సూపర్వైజర్ సుజాత

Article Image

రామన్నపేట: గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏడబ్ల్యూఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత సూచించారు. పోషణ మాసం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని చేర్చుకోవాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు.

రక్తహీనతపై అప్రమత్తత అవసరం

మహిళల్లో రక్తహీనతను నివారించేందుకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను క్రమం తప్పకుండా వాడడంతో పాటు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలసట, నీరసం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు.

తల్లి ఆరోగ్యమే.. బిడ్డకు రక్షణ

గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, బాలింతలు ప్రసవానంతరం తమ ఆరోగ్యంతో పాటు శిశువుకు తగిన పోషకాహారం అందించడంపై శ్రద్ధ వహించాలని సుజాత పేర్కొన్నారు. చిన్నారులకు తల్లిపాలు, వయసుకు అనుగుణంగా అదనపు పోషకాహారం అందించడం ముఖ్యమన్నారు.

పోషకాహారాన్ని నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని, పోషణ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు చిప్పలపల్లి సౌజన్య, నాగటి మంగమ్మ, ఆయాలు, వార్డు సభ్యులు కట్ట తనుశ్రీ, నోముల ఉమాదేవి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News