హైదరాబాద్: తెలంగాణలో ప్రజా పాలనను గాలికొదిలేశారని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు సైతం ప్రజలను పట్టించుకోకుండా ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కుంటుపడ్డాయని, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. పాలన గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్ చొరవ తీసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డాక్టర్ అశోక్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రానున్న రోజుల్లో ప్రజలు తిరస్కరించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి