పోలీసుల తీరుపై బాధితుల ఆవేదన..
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో వరుసగా జరుగుతున్న గొర్రెలు, మేకల దొంగతనాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముదిగొండ, కొండబీమనపల్లి ప్రాంతాల్లో గొర్రెలను దొంగిలించి మారుతి ఎర్టిగా వాహనంలో తరలిస్తున్న నలుగురిలో ఒకరిని పోలీసులు వారం రోజుల క్రితం పట్టుకున్నట్లు సమాచారం.
మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పట్టుబడిన నిందితుడిని విచారించగా దొంగిలించిన గొర్రెల ఆచూకీ లభించిందని, బాధితులు వాటిని గుర్తించినట్లు సమాచారం.
అయితే గొర్రెలను తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు ప్రస్తుతం వాటిని నేరుగా ఇవ్వడం కుదరదని, డబ్బు రూపంలో సగం మొత్తం చెల్లిస్తామని చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారంలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంతో పాటు తమ గొర్రెలను పూర్తిగా తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి