తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా అంగన్వాడీ కేంద్రంలో జాతీయ తొమ్మిదవ పోషణ మాసం సందర్బంగా గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ... గర్భవతులు, బాలింతలకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు స్థానిక అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేయాలని సూచించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.డి. కైరున్నిసా మాట్లాడుతూ... వెయ్యి రోజుల, ముర్రుపాల ప్రాముఖ్యత గురించి పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖాన లోనే ప్రసవం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగ లక్ష్మీ, వార్డ్ మెంబర్స్ వెంకన్న, రాజు, అంగన్వాడి టీచర్స్ రజిత, విజయలక్ష్మి, ఏఎన్ఎమ్ యశోద, ఆశ వర్కర్ సావిత్రి, గర్భవతులు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి ; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్
గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి ; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్
Bandi Kiran Kumar
తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా అంగన్వాడీ కేంద్రంలో జాతీయ తొమ్మిదవ పోషణ మాసం సందర్బంగా గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ... గర్భవతులు, బాలింతలకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు స్థానిక అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేయాలని సూచించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.డి. కైరున్నిసా మాట్లాడుతూ... వెయ్యి రోజుల, ముర్రుపాల ప్రాముఖ్యత గురించి పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖాన లోనే ప్రసవం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగ లక్ష్మీ, వార్డ్ మెంబర్స్ వెంకన్న, రాజు, అంగన్వాడి టీచర్స్ రజిత, విజయలక్ష్మి, ఏఎన్ఎమ్ యశోద, ఆశ వర్కర్ సావిత్రి, గర్భవతులు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి