Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:22 AM

భారీ వర్షాలు: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్

భారీ వర్షాలు: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్

భారీ వర్షాలు: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్
19-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాంనగర్, వినాయక నగర్, వెంకటరమణ కాలనీల్లో పర్యటన

స్వయంగా రంగంలోకి దిగి వరద కాలువల పూడికతీత

పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 13వ వార్డులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ సూచించారు. శుక్రవారం కురిసిన వర్షానికి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వార్డు పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాలైన రాంనగర్, వినాయక నగర్, జయభూమి వెంచర్, వెంకటరమణ కాలనీలలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు.వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో తన వ్యక్తిగత సిబ్బందితో నిలిచిన వరద నీరు సాఫీగా ముందుకెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, మట్టి కుప్పలు, చెత్తాచెదారాన్ని తొలగించారు.

​ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వార్డు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలోనైనా తనను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Sthanikam

భారీ వర్షాలు: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్

Article Image

రాంనగర్, వినాయక నగర్, వెంకటరమణ కాలనీల్లో పర్యటన

స్వయంగా రంగంలోకి దిగి వరద కాలువల పూడికతీత

పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 13వ వార్డులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ సూచించారు. శుక్రవారం కురిసిన వర్షానికి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వార్డు పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాలైన రాంనగర్, వినాయక నగర్, జయభూమి వెంచర్, వెంకటరమణ కాలనీలలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు.వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో తన వ్యక్తిగత సిబ్బందితో నిలిచిన వరద నీరు సాఫీగా ముందుకెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, మట్టి కుప్పలు, చెత్తాచెదారాన్ని తొలగించారు.

​ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వార్డు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలోనైనా తనను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News