మున్సిపల్ ఛైర్మన్కు నీటిముంపు సమస్య విన్నపం
తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు
పట్టణంలో కురిసిన వర్షానికి 12వ వార్డులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ శుక్రవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి, వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలను, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. అనంతరం సమస్య తీవ్రతను మున్సిపల్ ఛైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ మురుగు, వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుండటంతో స్పందించిన మున్సిపల్ ఛైర్మన్, వెంటనే అధికారులను ఆదేశించి తాత్కాలిక మరమ్మతు పనులు చేపంపించారు. అంతేకాకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని కాలనీవాసులకు భరోసానిచ్చారు. త్వరితగతిన స్పందించి పనులు ప్రారంభించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి