వనస్థలిపురం: గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. గణేష్ సురక్షా సంకల్ప్–2026లో భాగంగా వనస్థలిపురం పోలీసుల ఆధ్వర్యంలో బీఎన్ రెడ్డినగర్, కమలానగర్లోని గణేష్ మండపాల వద్ద ట్రాఫిక్, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని ఏసీపీ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువత, భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అన్నారు.
కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రవిబాబు, ఎస్ఐలు డి.నాగరాజు, బి.అనిల్కుమార్, డి.మల్లయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అర్జున్, ఆర్ఐ ట్రాఫిక్ వెంకటేష్, ఉషేంద్ర మణి, మమత, కొల్లూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి