రామన్నపేట ఎక్సైజ్ సర్కిల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఏడుకొండలు, ఎస్ ఐ అరుణ్కుమార్లను గీత కార్మికుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
గీత కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, కల్లుగీత సహకార సంఘాల సొసైటీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్గ్రేషియా, పెన్షన్ తదితర ప్రయోజనాలు అందేలా చూడాలని సంఘం నాయకులు అధికారులను కోరారు. అలాగే బెల్ట్ షాపులను నియంత్రించడంతోపాటు కల్తీ మద్యం, కల్తీ కల్లును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై సీఐ ఏడుకొండలు స్పందిస్తూ.. కల్తీ మద్యం, కల్తీ కల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. గీత కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో గీత కార్మికుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్గౌడ్, సొసైటీ ఉపాధ్యక్షులు, మండల నాయకులు లగ్గోని యాదయ్య, మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, సీనియర్ నాయకులు గంగాపురం యాదయ్య, సొసైటీ సభ్యులు చెరుకు శివరాజ్, నోముల వెంకటేశం, భూపతి నరసింహ, చెరుకు సత్యనారాయణ, వీరమల్ల లక్ష్మీనారాయణ, బండారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి