Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కోటాలో మెడికల్‌ సీటు. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిన మేడిపల్లి యువతి. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 12:00 PM

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు
20-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నారాయణఖేడ్‌కు చెందిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు పోటీ పడగా, చివరకు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఈ బాధ్యతలు దక్కాయి. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. 1990 నుంచి 1992 వరకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘ నాయకుడిగా, 1996 నుంచి 1999 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2000 నుంచి 2005 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు డీసీసీ కార్యదర్శిగా, 2015 నుంచి 2025 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డికి సోదరుడు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు

Article Image

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నారాయణఖేడ్‌కు చెందిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు పోటీ పడగా, చివరకు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఈ బాధ్యతలు దక్కాయి. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. 1990 నుంచి 1992 వరకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘ నాయకుడిగా, 1996 నుంచి 1999 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2000 నుంచి 2005 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు డీసీసీ కార్యదర్శిగా, 2015 నుంచి 2025 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డికి సోదరుడు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News