తుంగతుర్తి;
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటిలో నో బ్యాగ్ డే, బాలసభతో పాటు పింక్ కలర్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులను పుస్తకాల భారానికి దూరంగా ఉంచి, వారి వయస్సుకు అనుగుణంగా ఆటలు, పాటలు, కథలు, పద్యాలు, క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం, అనుకరణ, సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
బాలసభలో వారి నాయకత్వంలోవిద్యార్థులకు తమ ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శించే అవకాశం కల్పించడం జరిగిందని. ప్రసంగాలు, పాటలు, పద్యాలు, కథలు, నృత్యాలు, వేషధారణలు తదితర కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని సృజనాత్మకతను చాటుకున్నారని,పింక్ కలర్ డే సందర్భంగా విద్యార్థులు పింక్ రంగు దుస్తులు, వస్తువులతో పాల్గొన్నారు. పింక్ రంగును గుర్తించడం, పింక్ రంగులో ఉండే వస్తువులు, పువ్వులు తదితరాలను గుర్తించడం, పింకురంగు ప్రత్యేకతలు తెలిపే రైమ్స్ పాడడంవంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకు రంగులపై అవగాహన కల్పించడం జరిగింది పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా అనుభవాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించడం వల్ల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ....విద్యార్థులు స్వయంగా పాల్గొని, పరిశీలించి, ఆలోచించి, అనుభవం ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం జీవితాంతం గుర్తుండిపోతుందని,ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి, దానికి తగిన అవకాశాలను కల్పించడం పాఠశాల బాధ్యతని,ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన, సృజనాత్మకమైన నాయకులుగా ఎదగడానికి దోహదపడతాయని అన్నారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్ట గడుపుల విక్రం, గుండ్ల ఆంజనేయులు, రామణబోయిన మౌనిక, అబ్బ గాని మంజులలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి