Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కోటాలో మెడికల్‌ సీటు. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిన మేడిపల్లి యువతి. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 12:01 PM

లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత

లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత

లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత
20-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్‌లో జీవో 118 ధ్రువపత్రాల పంపిణీ

లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత

ఎల్బీనగర్‌, సెప్టెంబర్‌ 20: ఎల్బీనగర్‌ నియోజకవర్గ ప్రజల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జీవో 118 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ మహ్మద్‌ అజారుద్దీన్‌తో కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. వేలాది మంది లబ్ధిదారులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం సందడిగా మారింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించడం హర్షణీయమన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ధ్రువపత్రాల పంపిణీని వేగవంతం చేశారని తెలిపారు.

జీవో 118 ద్వారా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత

Article Image

ఎల్బీనగర్‌లో జీవో 118 ధ్రువపత్రాల పంపిణీ

లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పత్రాలు అందజేత

ఎల్బీనగర్‌, సెప్టెంబర్‌ 20: ఎల్బీనగర్‌ నియోజకవర్గ ప్రజల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జీవో 118 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ మహ్మద్‌ అజారుద్దీన్‌తో కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. వేలాది మంది లబ్ధిదారులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం సందడిగా మారింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించడం హర్షణీయమన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ధ్రువపత్రాల పంపిణీని వేగవంతం చేశారని తెలిపారు.

జీవో 118 ద్వారా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News