రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ప్రముఖులు వల్దాస్ మౌనిక - సందీప్ గౌడ్ దంపతులు, నీళ్ల సుభద్ర - అశోక్ గౌడ్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, కలశ స్థాపన, ప్రత్యేక అభిషేకాలు మరియు అర్చనలు జరిపించారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దైవాన్ని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి