ముఖ్యఅతిథులుగా హాజరైన కౌన్సిలర్ పాక చిరంజీవి-పద్మ దంపతులు
సహకరించిన దాతలకు ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కృష్ణానగర్ కాలనీలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి-పద్మ దంపతులు, మార్గం నరసింహ యాదవ్, పెద్దగోని రమేష్, ముద్దం సత్తయ్య ముఖ్యఅతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్నదాన దాతలు చెరుకు స్వాతి-శివ గౌడ్, మార్గం సంగీత-స్వామి యాదవ్లతో కలసి భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.కార్యక్రమంలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు గుయ్యని జంగయ్య, సభవత్ నాగేష్, కరంటోతు చందు, సుర్వి శ్రీను, కరంటోతు పాండు, మాతృ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి