పద్మజ్యోతి యువజన సంఘం సేవా కార్యక్రమం
సమాజ సేవలో భాగంగా కొయ్యలగూడెం పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్ వైద్య బృందం ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా బిపి, షుగర్, రక్త పరీక్షలతో పాటు ఈ.సి .జి , 2డి ఈచో టెస్టులు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు బడుగు కైలాసం మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం అందించిన పద్మజ్యోతి యువజన సంఘం సభ్యులను గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాజు, సురేందర్, రాఘవేంద్ర, ఆనంద్, శ్రీను, శేఖర్, గిరీష్, పాండు, సతీష్, సంతోష్, శ్రీనాథ్, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి