Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన! కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 10:28 PM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన!
July 30, 2026 08:26 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠశాల దశ నుంచే పెంపొందించుకోవాలి

చిన్నకొండూరు పాఠశాలలో ఏఐ , ఏం ఎల్ , సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక సదస్సు

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యార్థులు పాఠశాల దశ నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, మందోళ్ల గూడెం ఉపసర్పంచ్ డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిన్నకొండూర్ ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు "కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఏంఎల్), సైబర్ భద్రత" అనే అంశాలపై శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నాగోల్) సౌజన్యంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ​ఈ సందర్భంగా శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వివరిస్తూ, డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు సులభశైలిలో అర్థమయ్యేలా వివరించారు. అనునిత్యం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.

​విద్యార్థుల్లో సాంకేతిక విద్యపై ఆసక్తిని పెంపొందింపజేసి, నూతన ఆవిష్కరణల వైపు ఆలోచించేలా ప్రేరణనిచ్చిన శ్రీధర్ రెడ్డి, శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి విజ్ఞానవంతమైన కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News