Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'మా ఫిర్యాదును పట్టించుకోలేదు'.. నార్కెట్‌పల్లి ఎస్సైపై బాధిత కుటుంబం ఆరోపణలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 10:16 PM

బతుకమ్మ చీరలపై చురకలు.. పోలీసుల తీరుపైనా చిరుమర్తి ఫైర్

బతుకమ్మ చీరలపై చురకలు.. పోలీసుల తీరుపైనా చిరుమర్తి ఫైర్

బతుకమ్మ చీరలపై చురకలు.. పోలీసుల తీరుపైనా చిరుమర్తి ఫైర్
July 29, 2026 08:30 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పాటు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ఏడాది పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలను ఏడాది ఆలస్యంగా పంపిణీ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలకు అందజేస్తున్న చీరల్లో నాణ్యత లోపించిందని, ఒకే నమూనాలో ఉండటంతో అవి యూనిఫాంలా కనిపిస్తున్నాయని మహిళలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలోని పోలీసు అధికారుల పనితీరుపైనా చిరుమర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐలు, ఎస్ఐలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

పోలీసులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించిన ఆయన, లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజలతో మాట్లాడే భాష, ఉపయోగిస్తున్న పదజాలాన్ని వెంటనే మార్చుకోవాలని సూచిస్తూ, రాష్ట్ర డీజీపీ కూడా నకిరేకల్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News