Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 07:35 PM

రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
July 29, 2026 02:47 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రైతుల శ్రేయస్సు, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

గ్రామంలోని శ్రీ నాభిశిల బొడ్రాయి వద్ద సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుంచి బిందెడు నీరు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు తీసుకువచ్చి నాభిశిల బొడ్రాయికి జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి రైతుల సంక్షేమం, గ్రామాభివృద్ధి, సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News