రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రైతుల శ్రేయస్సు, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని శ్రీ నాభిశిల బొడ్రాయి వద్ద సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుంచి బిందెడు నీరు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు తీసుకువచ్చి నాభిశిల బొడ్రాయికి జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి రైతుల సంక్షేమం, గ్రామాభివృద్ధి, సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి