Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ అధ్యక్షుడిగా కే. పవన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 11:13 PM

లాభదాయకం లేకుండాఈటూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.. సర్పంచ్ దామోదర్

లాభదాయకం లేకుండాఈటూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.. సర్పంచ్ దామోదర్

లాభదాయకం లేకుండాఈటూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా..  సర్పంచ్ దామోదర్
July 28, 2026 08:56 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లానాగారం మండలం ఈటూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని స్థానిక సర్పంచ్ వంగూరి దామోదర్ అన్నారు. మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వంగరి సంస్థను 2018లో ప్రారంభించి అనేక పేద కుటుంబాలకు ఆదుకున్నామని అన్నారు. కరోనా టైం లో ప్రాణాలు లెక్క చేయకుండా నిరుపేదలకు నిత్యవసర సరుకులు, విద్యార్థులకు డ్రెస్సులు, బ్యాగులు, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. వంగరిఫౌండేషన్ ద్వారా గ్రామంలో బతుకమ్మ పండుగ, బోనాలు, ఆలయాలు నిర్మాణం, విద్యార్థులకు కావలసిన సామాగ్రిని, గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా అందజేశామని అన్నారు. గత పాలకుల వల్లఈటూరు గ్రామంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అందుకే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. గ్రామo లో ప్రజలు సమస్యలు తెలిపారు. గ్రామానికి ఉన్న విద్య, మంచినీటి సమస్య , మురికి కాలువలు, సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, వాటర్ ప్లాంట్ తదితర సమస్యలుతెలిపారు . నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించారు. మాట ప్రకారమే తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో గ్రామంలో సిసి రోడ్లు లింకు రోడ్లునిర్మాణ పనులు చేపట్టమని, మురికి కాలువల డ్రైనేజీనిర్మాణం పనులు చేపట్టామని, వంటి ఒక్కొక్కటిగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో చదవడానికి పోరుగురు నుంచి ఈటూరు గ్రామానికి పాఠశాలకు రావడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నరూ. ఈ విషయాన్ని ఆరాధ్య ఫౌండేషన్ వాణి మేడం గమనించి వెంటనే స్పందించి విద్యార్థులకు చదవడానికి ఆటో సౌకర్యం కల్పించారని అన్నారు. గ్రామంలో ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ మీద యువత వాటి జోలి పోకుండా అవగాహన కల్పించి మంచి మార్గంలో నడి పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామంలో పాఠశాల 220 విద్యార్థులకు సొంత నిధులతో స్కూలు యూనిఫాము పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో వన మహోత్స లో కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 1700 మొక్కలు నాటామని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గ్రామంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి రాకపోకులకు రోడ్లు ,అద్వానంగా మారాయని , అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణo, అంగన్వాడి భవనం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యేకుచెప్పడం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామంలోని నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. ఎలాంటి లాభదాయకం లేకుండా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈటూరు గ్రామాన్ని తీర్చి దిద్దడానికి మళ్లీ సర్పంచే ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా నిలబడతానని అన్నారు. ఈటూరు గ్రామాన్ని రాజకీయాల పార్టీల అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ఆదర్శవంతంగా తీర్చు దిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News