అత్యవసరమైతేనే బయటకు రావాలి: ఎస్ఐ దుర్గారెడ్డి
అత్యవసరమైతేనే బయటకు రావాలి: ఎస్ఐ దుర్గారెడ్డి
Krishna
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి ప్రజలకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, కాలువలు, వాగులు, చెరువులు, కుంటల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే బలహీనంగా ఉన్న లేదా వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలను నీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లనివ్వకూడదని సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఎస్ఐ దుర్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని, అందరూ అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి