Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 04:10 PM

విధుల నిర్వహణలో బిఎల్వోల సేవలు అభినందనీయం, ఘన సన్మానం : కౌన్సిలర్ తిరుమణి యాదగిరి

విధుల నిర్వహణలో బిఎల్వోల సేవలు అభినందనీయం, ఘన సన్మానం : కౌన్సిలర్ తిరుమణి యాదగిరి

విధుల నిర్వహణలో బిఎల్వోల సేవలు అభినందనీయం, ఘన సన్మానం : కౌన్సిలర్ తిరుమణి యాదగిరి
July 28, 2026 01:51 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో బూత్ లెవల్ అధికారులు (బిఎల్వోలు) కీలక పాత్ర పోషిస్తున్నారని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి కొనియాడారు. మున్సిపాలిటీలోని మాలిపురం పరిధిలో గల 308 మరియు 309 పోలింగ్ బూతులలో బిఎల్వోలుగా విధులు నిర్వర్తించిన మద్దూరి ఉమేష్, చింతకాయల పరుశురాములు తమ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి నివాసంలో వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి, సన్మానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ యాదగిరి మాట్లాడుతూ.. ఎండనక, వాననక ప్రతి ఇంటికీ తిరుగుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో బిఎల్వోలు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఇలాగే బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు జంపాల భిక్షం, మామిడాల వెంకటేశ్వర్లు, ఈశ్వర చారి, సోమన్న తదితరులు పాల్గొని, విధులను విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్వోలను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News