నిదానపల్లి యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్కు బాధ్యతలు
నిదానపల్లి యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్కు బాధ్యతలు
Editor Desk
రామన్నపేట,
: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ యువ కాంగ్రెస్ కమిటీని తెలంగాణ యువ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రకటించారు. గ్రామ కమిటీని తక్షణమే అమల్లోకి వచ్చేలా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా వర్కల శివకుమార్, ప్రధాన కార్యదర్శులుగా జినుకల రాజేందర్, కడారి రాజశేఖర్, కార్యదర్శులుగా కొండ వెంకటేష్, గోగు సాయి, సోషల్ మీడియా ఇన్చార్జిగా బొడ్డుపల్లి మహేష్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రామ స్థాయిలో యువతను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు చేరువ చేస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నియామక ఉత్తర్వుల్లో సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి