Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్
14-07-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, శివచరణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన సైదులు, ఏర్పుల పరమేష్, మెండే వెంకన్న, ఏళ్ళ మల్లేష్, ఏర్పుల స్వామి, ఆగు అశోక్, ఏళ్ల శేఖర్, చింతపల్లి ప్రవీణ్, కడారి దేవి, మద్ది మధు, పోషబోయిన నరసింహ, మేకల బిక్షం, రేముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

Article Image

చిట్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, శివచరణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన సైదులు, ఏర్పుల పరమేష్, మెండే వెంకన్న, ఏళ్ళ మల్లేష్, ఏర్పుల స్వామి, ఆగు అశోక్, ఏళ్ల శేఖర్, చింతపల్లి ప్రవీణ్, కడారి దేవి, మద్ది మధు, పోషబోయిన నరసింహ, మేకల బిక్షం, రేముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News