Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 01:32 PM

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్

ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్
July 14, 2026 12:04 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, శివచరణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన సైదులు, ఏర్పుల పరమేష్, మెండే వెంకన్న, ఏళ్ళ మల్లేష్, ఏర్పుల స్వామి, ఆగు అశోక్, ఏళ్ల శేఖర్, చింతపల్లి ప్రవీణ్, కడారి దేవి, మద్ది మధు, పోషబోయిన నరసింహ, మేకల బిక్షం, రేముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News