ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్
ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులపై ఉందని అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, శివచరణ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గుండెబోయిన సైదులు, ఏర్పుల పరమేష్, మెండే వెంకన్న, ఏళ్ళ మల్లేష్, ఏర్పుల స్వామి, ఆగు అశోక్, ఏళ్ల శేఖర్, చింతపల్లి ప్రవీణ్, కడారి దేవి, మద్ది మధు, పోషబోయిన నరసింహ, మేకల బిక్షం, రేముడాల మధు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి