Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:14 AM

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా డా. మద్దిలేటి నియామకం

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా డా. మద్దిలేటి నియామకం

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా డా. మద్దిలేటి నియామకం
July 14, 2026 04:43 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా గణితశాస్త్ర విభాగ అధ్యాపకుడు డా. మద్దిలేటిని నియమిస్తూ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో డా. మద్దిలేటి ఒక సంవత్సరం పాటు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, అంతర్విశ్వవిద్యాలయ పోటీలకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

డా. మద్దిలేటి గతంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా, గణితశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించి విశిష్ట పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు. విద్యా, పరిపాలనా రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించిన విశ్వవిద్యాలయ యాజమాన్యం స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా నియమించింది.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం కల్పించడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన డా. మద్దిలేటి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ క్రీడా విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వివిధ స్థాయిల పోటీల్లో ఎంజీయూ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

డా. మద్దిలేటి నియామకాన్ని విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవితో పాటు పలువురు అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతల్లో డా. మద్దిలేటి విశ్వవిద్యాలయ క్రీడారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తారనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News