PRINT TIME: July 14, 2026 07:12 AM
పాము కాటుతో కార్మికుడి మృతి
పాము కాటుతో కార్మికుడి మృతి
July 14, 2026 04:43 AM
8 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
పాము కాటుకు గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన కొయ్యలగూడెం శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తండాకు చెందిన ధీరావత్ స్వామి (34) ల్యాబర్ కార్మికుడు. ఈ నెల 11న కొయ్యలగూడెంలోని ప్రతిభ బయోటెక్ కంపెనీలో సెంట్రింగ్ పని ముగించుకుని రాత్రి వేళ బస్ స్టాప్నకు నడుచుకుంటూ వస్తుండగా పాము కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున స్వామి మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి. రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి