Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:31 AM

పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!

పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!

పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!
13-07-2026 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.


నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పిట్టంపల్లి గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న కొన్ని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా పరిశ్రమల నుంచి వస్తున్న దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన, ధూళి కారణంగా గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.కాలుష్యం ప్రభావంతో గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్న గ్రామస్తులు, దీనిపై సంబంధిత శాఖలతో వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Sthanikam

పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!

Article Image


కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.


నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పిట్టంపల్లి గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న కొన్ని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా పరిశ్రమల నుంచి వస్తున్న దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన, ధూళి కారణంగా గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.కాలుష్యం ప్రభావంతో గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్న గ్రామస్తులు, దీనిపై సంబంధిత శాఖలతో వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News