జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తమ సమస్యలు, ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను బాధితులు ఎస్పీకి నేరుగా వివరించారు.
ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను శ్రద్ధగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి