Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:20 PM

నారాయణఖేడ్ లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2పై బూత్‌ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ

నారాయణఖేడ్ లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2పై బూత్‌ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ

నారాయణఖేడ్ లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2పై బూత్‌ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ
31-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్ల సమావేశం నిర్వహించి, ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2 ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గాంధీ భవన్ నుంచి విచ్చేసిన మాస్టర్‌ శిక్షకుడు, ఎస్‌ఐఆర్‌ సమన్వయకర్త శ్రీ మాణిక్యం మల్లేష్‌ యాదవ్‌ ఓటర్ల జాబితా పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడటం, అవసరమైన సవరణలు చేపట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్‌ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2 ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, బూత్‌ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్ లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2పై బూత్‌ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్ల సమావేశం నిర్వహించి, ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2 ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గాంధీ భవన్ నుంచి విచ్చేసిన మాస్టర్‌ శిక్షకుడు, ఎస్‌ఐఆర్‌ సమన్వయకర్త శ్రీ మాణిక్యం మల్లేష్‌ యాదవ్‌ ఓటర్ల జాబితా పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడటం, అవసరమైన సవరణలు చేపట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్‌ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.ఎస్‌ఐఆర్‌ ఫేజ్–2 ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, బూత్‌ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News