Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:14 PM

చేయూత పెన్షన్‌ దరఖాస్తుల గడువు పొడిగించాలి

చేయూత పెన్షన్‌ దరఖాస్తుల గడువు పొడిగించాలి

చేయూత పెన్షన్‌ దరఖాస్తుల గడువు పొడిగించాలి
30-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు కార్తీక్‌ గౌడ్‌

సాంకేతిక సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోతున్న అర్హులు

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెన్షన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగ నిర్ణయించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అనేకమంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. ​అవసరమైన ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడం, ఆన్‌లైన్ కేంద్రాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం గడువు ముగిసిందనే కారణంతో ఒక్క అర్హుడు కూడా సామాజిక భద్రతా పథకానికి దూరం కాకూడదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచాలని కోరారు. అదేవిధంగా గ్రామస్థాయిలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అర్హులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చేయూత పెన్షన్‌ దరఖాస్తుల గడువు పొడిగించాలి

Article Image

బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు కార్తీక్‌ గౌడ్‌

సాంకేతిక సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోతున్న అర్హులు

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెన్షన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగ నిర్ణయించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అనేకమంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. ​అవసరమైన ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడం, ఆన్‌లైన్ కేంద్రాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం గడువు ముగిసిందనే కారణంతో ఒక్క అర్హుడు కూడా సామాజిక భద్రతా పథకానికి దూరం కాకూడదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచాలని కోరారు. అదేవిధంగా గ్రామస్థాయిలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అర్హులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News