బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు కార్తీక్ గౌడ్
సాంకేతిక సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోతున్న అర్హులు
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెన్షన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగ నిర్ణయించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అనేకమంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. అవసరమైన ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడం, ఆన్లైన్ కేంద్రాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం గడువు ముగిసిందనే కారణంతో ఒక్క అర్హుడు కూడా సామాజిక భద్రతా పథకానికి దూరం కాకూడదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచాలని కోరారు. అదేవిధంగా గ్రామస్థాయిలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అర్హులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి